ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్కేర్ స్కీమ్ ప్రారంభించనున్న ఇండియా
- August 14, 2018దుబాయ్: ఆయుష్మాన్ భారత్ పేరుతో భారత ప్రభుత్వం, ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ స్కీమ్ని ప్రారంభించబోతోంది. 100 మిలియన్ మంది ఈ ప్రోగ్రామ్లో లబ్దిదారులు కానున్నారు. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ని ప్రారంభించనున్నారు. ప్రతి కుటుంబానికి 5 మిలియన్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఈ స్కీమ్ ద్వారా దక్కుతుంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ విజయ్కుమార్ సింగ్ దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు, స్వదేశంలో ఆపన్నులకు సహాయమందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరాక్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు, అలాగే యెమెన్లో ఇరుక్కుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంలో మంత్రి పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యూఏఈలో భారత రాయబారి నవ్దీప్సింగ్ సూరి, భారత కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. యూఏఈ లో మొత్తం 3.5 మిలియన్ మంది భారతీయులు ఉన్నారని, యూఏఈ జనాభాలో వీరిది 33 శాతమని సూరి చెప్పారు.గత రాత్రి ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో మీట్ & గ్రీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమములో పలువురు యూ.ఏ.ఈ ప్రముఖులు బి.ఆర్.శెట్టి,ఖాన్,గోపాల్,సజివ్ పురుషోత్తం,డా.చంద్ర శేఖర్ కుంతియా మరియు IPF నుంచి గిరీష్ పంత్,శ్రీనివాస్ జనగామ,కుంభాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గున్నారు.చివరగా సుమతి వాసుదేవన్(కాన్సుల్ జనరల్,దుబాయ్) వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేసారు.
తాజా వార్తలు
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..