మహారాష్ట్రలో బ్యాంకు దోపిడి...
- August 14, 2018
తాళాలు పగలగొట్టి, బెదిరించి, కదిలారంటే కాల్చి పారేస్తాం లాంటి దొంగతనాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఆన్లైన్ దొంగతనాలు. చదువుకున్న చదువుకి ఆధునిక టెక్నాలజీని జోడించి స్మార్ట్గా దొంగతనాలు చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా మొత్తం మూటగట్టేస్తున్నారు.
మహారాష్ట్ర పూణేకు చెందిన కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్ను హ్యాక్ చేసి రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. ఈనెల 11న బ్యాంకు సర్వర్ను హ్యాక్ చేసిన నిందితులు రూ.78 కోట్లు ఖాళీ చేశారు.
అనంతరం 13న మరో సారి దాడి చేసి రూ. 14 కోట్లు నొక్కేశారు. అంతే కాకుండా నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా మొత్తం రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంకు నుంచి కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







