హైదరాబాద్ లో సూడాన్ యువకుడు దారుణ హత్య
- August 14, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రాషెష్ అనే సూడాన్ యువకుడు నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సన్సిటీ సి అండ్టి కాలనీలో ఈ ఘటన జరిగింది. రాషెష్ స్నేహితులైన అబ్దుల్లా,లిసాలతో కలసి రూంలో భోంచేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న గొడవ మొదలైంది. అదికాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అబ్దుల్లా, లిసాలిద్దరు పండ్లు కోసే కత్తితో రాషెష్ను పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. రాషెష్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లా ,లిసాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







