హైదరాబాద్ లో సూడాన్ యువకుడు దారుణ హత్య
- August 14, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రాషెష్ అనే సూడాన్ యువకుడు నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సన్సిటీ సి అండ్టి కాలనీలో ఈ ఘటన జరిగింది. రాషెష్ స్నేహితులైన అబ్దుల్లా,లిసాలతో కలసి రూంలో భోంచేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న గొడవ మొదలైంది. అదికాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అబ్దుల్లా, లిసాలిద్దరు పండ్లు కోసే కత్తితో రాషెష్ను పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. రాషెష్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లా ,లిసాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







