హైదరాబాద్ లో సూడాన్ యువకుడు దారుణ హత్య
- August 14, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రాషెష్ అనే సూడాన్ యువకుడు నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సన్సిటీ సి అండ్టి కాలనీలో ఈ ఘటన జరిగింది. రాషెష్ స్నేహితులైన అబ్దుల్లా,లిసాలతో కలసి రూంలో భోంచేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న గొడవ మొదలైంది. అదికాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అబ్దుల్లా, లిసాలిద్దరు పండ్లు కోసే కత్తితో రాషెష్ను పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. రాషెష్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లా ,లిసాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









