వీకెండ్లో ఎంగేజ్మెంట్ పార్టీ ప్లాన్ చేసిన ప్రియాంక
- August 15, 2018
ఎట్టకేలకు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా. కొద్దిరోజుల కిందట అమెరికాలోని తన ఫ్రెండ్స్ సమక్షంలో సింగర్ నిక్ జోనాస్తో నిశ్చితార్థం జరిగినట్టు వెల్లడించింది. దీంతో ఈనెల 18న తమ ఫ్రెండ్స్ కోసం ముంబైలో ఘనంగా పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫంక్షన్ కోసం నిక్ ఫ్యామిలీ సభ్యులు ఇండియా రాబోతున్నారని, వాళ్ల కోసం ఓ ఫైవ్స్టార్ హోటల్ను బుక్ చేసిందట పీసీ. ఆ రోజే మీడియా ముందు తన మ్యారేజ్ గురించి ప్రకటన చేయనుంది.
ఇక ప్రియాంకచోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ని బయటపెట్టింది ప్రియాంకచోప్రా. మంగళవారం రాత్రి ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన నివాసంలో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి పీసీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా తన పెళ్లి గురించి బయటపెట్టినట్టు సమాచారం. నిక్ తన చేతి వేలికి తొడిగిన డైమండ్ ఉంగరాన్ని చూపించింది. ఆ రింగ్ విలువ మన కరెన్సీలో అయితే దాదాపు కోటి రూపాయలకు పైనే!
ఇందులో నాలుగు క్యారట్ల వజ్రాలు ఉన్నాయట. తన బర్త్ డే ముందు ప్రియుడితో నిక్తో కలిసి లండన్ కి వెళ్లింది ప్రియాంక. అమెరికన్ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్ కో షాప్లో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఒక్క రోజు షాప్కి కస్టమర్లు రాకుండా క్లోజ్ చేయించి మరీ, అన్నీ పరిశీలించి డైమండ్ రింగ్ని నిక్ ఎంపిక చేసినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నమాట.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







