వీకెండ్లో ఎంగేజ్మెంట్ పార్టీ ప్లాన్ చేసిన ప్రియాంక
- August 15, 2018
ఎట్టకేలకు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా. కొద్దిరోజుల కిందట అమెరికాలోని తన ఫ్రెండ్స్ సమక్షంలో సింగర్ నిక్ జోనాస్తో నిశ్చితార్థం జరిగినట్టు వెల్లడించింది. దీంతో ఈనెల 18న తమ ఫ్రెండ్స్ కోసం ముంబైలో ఘనంగా పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫంక్షన్ కోసం నిక్ ఫ్యామిలీ సభ్యులు ఇండియా రాబోతున్నారని, వాళ్ల కోసం ఓ ఫైవ్స్టార్ హోటల్ను బుక్ చేసిందట పీసీ. ఆ రోజే మీడియా ముందు తన మ్యారేజ్ గురించి ప్రకటన చేయనుంది.
ఇక ప్రియాంకచోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ని బయటపెట్టింది ప్రియాంకచోప్రా. మంగళవారం రాత్రి ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన నివాసంలో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి పీసీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా తన పెళ్లి గురించి బయటపెట్టినట్టు సమాచారం. నిక్ తన చేతి వేలికి తొడిగిన డైమండ్ ఉంగరాన్ని చూపించింది. ఆ రింగ్ విలువ మన కరెన్సీలో అయితే దాదాపు కోటి రూపాయలకు పైనే!
ఇందులో నాలుగు క్యారట్ల వజ్రాలు ఉన్నాయట. తన బర్త్ డే ముందు ప్రియుడితో నిక్తో కలిసి లండన్ కి వెళ్లింది ప్రియాంక. అమెరికన్ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్ కో షాప్లో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఒక్క రోజు షాప్కి కస్టమర్లు రాకుండా క్లోజ్ చేయించి మరీ, అన్నీ పరిశీలించి డైమండ్ రింగ్ని నిక్ ఎంపిక చేసినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నమాట.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







