కేరళకు వారంరోజులపాటు ఉచిత కాల్స్, డాటా సేవలను ప్రకటించిన టెలికాం సంస్థలు
- August 17, 2018
కేరళ:పదిరోజులుగా వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సహాయం చేసేందుకు టెలికాం దిగ్గజాలు ముందుకొచ్చాయి. వారం రోజులపాటు ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచిత కాల్స్, డాటా సేవలను అందిస్తున్నట్టు రిలయెన్స్ జియో, బీఎస్ఎన్ఎల్లు ప్రకటించాయి. అలాగే పోస్ట్పెయిడ్ కస్టమర్లు చెల్లించాల్సిన బిల్లులకు గడవు తేదీని పెంచినట్టు టెలికాం సంస్థలు తెలిపాయి. ఎయిర్ టెల్ తనవంతుగా 30 రూపాయల టాక్టైమ్.. వారం రోజులపాటు 1 జీబీ డాటా ప్రకటించింది. అంతేకాదు వరదలతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాలకు తమ ఎయిర్టెల్ స్టోర్లలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని ఇందుకోసం.. త్రిసూర్, కాలికట్, మలప్పురం, కన్నూర్, త్రివేంద్రం, ఎర్నాకులం వంటి ప్రాంతాల్లో హెవీ స్టోరేజీ బ్యాటరీలు అందుబాటులో ఉన్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ఇదిలావుంటే కేరళలో జల విలయం కొనసాగుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడ్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క పలక్కడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో నిన్న(గురువారం) ఒక్కరోజే ఐదుగురు మరణించారు. ఇప్పటివరకు 87 మంది మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంతి పినరయి విజయన్ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









