కేరళ వరద బాధితులకు యూఏఈ లీడర్స్ సంఘీభావం
- August 17, 2018యూఏఈ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి 'కేబుల్ ఆఫ్ కండోలెన్స్' పంపించారు. కేరళ రాష్ట్రంలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు నిలువ నీడ కోల్పోవడం పట్ల ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు షేక్ ఖలీఫా, రామ్నాథ్ కోవింద్కి పంపిన సంఘీభావ లేఖలో పేర్కొన్నారు. దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం కేరళ వరద బాధితులకు సంఘీభావం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు