కేరళకు తక్షణ వరద సాయం రూ.500కోట్లు..మోదీ ప్రకటన
- August 17, 2018
కొచ్చి:వరదలతో విలవిల్లాడిన కేరళ రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతరం కేరళ గవర్నర్, సీఎం, కేంద్రమంత్రితో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే కోసం ఐఎన్ఎస్ గరుడ ప్రత్యేక హెలికాప్టరులో బయలుదేరారు. నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. ఇడిన్ జిల్లలం నుంచి కావుభాగం వరకు రోడ్డు వరదనీటిలో మునగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









