కేరళకు తక్షణ వరద సాయం రూ.500కోట్లు..మోదీ ప్రకటన
- August 17, 2018
కొచ్చి:వరదలతో విలవిల్లాడిన కేరళ రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతరం కేరళ గవర్నర్, సీఎం, కేంద్రమంత్రితో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే కోసం ఐఎన్ఎస్ గరుడ ప్రత్యేక హెలికాప్టరులో బయలుదేరారు. నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. ఇడిన్ జిల్లలం నుంచి కావుభాగం వరకు రోడ్డు వరదనీటిలో మునగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి