అమెరికాలో తెలుగు వాసి మృతి
- August 19, 2018
అమెరికాలో మరో తెలుగు వాసి మృతి చెందాడు. పశ్చిమగోదావరి దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్(35) మృతి చెందాడు. సురేష్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసి అక్కడే కొంతకాలం పని చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని టీసీఎస్ సంస్థలో పని చేసాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం కారులో సురేష్ చనిపోయి ఉన్నాడు. స్నేహితులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







