అమెరికాలో తెలుగు వాసి మృతి
- August 19, 2018
అమెరికాలో మరో తెలుగు వాసి మృతి చెందాడు. పశ్చిమగోదావరి దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్(35) మృతి చెందాడు. సురేష్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసి అక్కడే కొంతకాలం పని చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని టీసీఎస్ సంస్థలో పని చేసాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం కారులో సురేష్ చనిపోయి ఉన్నాడు. స్నేహితులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









