తెలంగాణ:దర్గా వందల ఏళ్ల నుండి సర్వ మతాలకు వేదిక
- August 21, 2018తెలంగాణ:వందల ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా నిలిచింది ఆ దర్గా. సర్వ మతాలకు వేదిక ఆ దర్గా.అదే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ సయ్యద్ అంకుషావలి రహ్మతుల్లా దర్గా.బక్రీద్ పర్వదినం ప్రారంభం కానున్న సంధర్బంగా ఈ దర్గా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా ప్రాంతంలో ఏ కులానికి చెందిన వారైనా అంతా సమానమే.ఆధ్యాత్మికతే ప్రధానం.విశ్వాసాలు వేరైనా ఆ ప్రార్ధనా మందిరంలో నిర్వహించే పూజలపై భక్తులకు ఎనలేని నమ్మకం.ఇక్కడ ప్రతి యేటా బక్రిద్ పండుగ రోజున ఉర్సు ఉత్సవాలు ప్రాంభమవుతాయి.
సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన బిజిగిరి షరీఫ్ దర్గాని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు.ఇది జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.విశ్వమానవ సమానత్వం చాటిన సోదరులు సయ్యద్ అంకుషావళి రహమతుల్లా అలై తదితరుల సమాధులు యిక్కడ వున్నాయి.అరబ్ దేశం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజిగిరి షరీఫ్ గ్రామానికి చేరుకుని దర్గాను నిర్మించుకున్నారు హజ్రత్ సయ్యద్ అంకుషావలి. ఆయన ప్రదర్శించిన మహిమల కారణంగా ప్రజలు సుఖశాంతుల జీవించారని చెబుతారు.నిష్టతో వేడుకుంటే భక్తుల కోర్కెలు అంకుషావలి తప్పక తీరుస్తారనేది ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈ దర్గాలో బక్రిద్ పండుగ రోజున సాయంత్రం ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.భక్తుల మొక్కులు చెల్లించటంతో ఉత్సవాలు ముగుస్తాయి.ప్రధాన ఘట్టమైన గంధలేపనం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది.ఈ ఉర్సు ఉత్సవంలో మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు