ఈద్ అల్ అధా ప్రార్థనల్లో పాల్గొన్న యూఏఈ లీడర్స్
- August 21, 2018
యూఏఈ:యూఏఈ లీడర్స్, అలాగే పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా జరిగిన ఈద్ అల్ అధా వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్ అల్ అధా ప్రారంభం నేపథ్యంలో ఆయా ప్రముఖులు, ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ మొహమ్మద్తో కలిసి షేక్ రషీద్ బిన్ సయీద్ మాస్క్ (జబీల్లో)లో ప్రార్థనలు నిర్వహించారు. అబుదాబీలో క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఈద్ ప్రార్థనల్ని అల్ బతీన్లోని సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ మాస్క్లో ప్రార్థనల్ని నిర్వహించడం జరిగింది. అజ్మన్ రూలర్ షేక్ హుమైద్, షేక్ రషీద్ బిన్ హుమైద్ మాస్క్లో ఈద్ ప్రార్థనలు చేయడం జరిగింది. రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సాద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, ఖుజామ్లోని ఈద్ గ్రాండ్ ముసల్లాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు ప్రముఖులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రాండ్ షేక్ జాయెద్ మాస్క్లో ఫుజారియా రూలర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి ప్రార్థనలు నిర్వహించారు. రూలర్స్ అంతా ఒకరికి ఒకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









