ఈద్ అల్ అధా ప్రార్థనల్లో పాల్గొన్న యూఏఈ లీడర్స్
- August 21, 2018యూఏఈ:యూఏఈ లీడర్స్, అలాగే పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా జరిగిన ఈద్ అల్ అధా వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్ అల్ అధా ప్రారంభం నేపథ్యంలో ఆయా ప్రముఖులు, ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ మొహమ్మద్తో కలిసి షేక్ రషీద్ బిన్ సయీద్ మాస్క్ (జబీల్లో)లో ప్రార్థనలు నిర్వహించారు. అబుదాబీలో క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఈద్ ప్రార్థనల్ని అల్ బతీన్లోని సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ మాస్క్లో ప్రార్థనల్ని నిర్వహించడం జరిగింది. అజ్మన్ రూలర్ షేక్ హుమైద్, షేక్ రషీద్ బిన్ హుమైద్ మాస్క్లో ఈద్ ప్రార్థనలు చేయడం జరిగింది. రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సాద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, ఖుజామ్లోని ఈద్ గ్రాండ్ ముసల్లాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు ప్రముఖులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రాండ్ షేక్ జాయెద్ మాస్క్లో ఫుజారియా రూలర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి ప్రార్థనలు నిర్వహించారు. రూలర్స్ అంతా ఒకరికి ఒకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం