ఈద్‌ అల్‌ అధా ప్రార్థనల్లో పాల్గొన్న యూఏఈ లీడర్స్‌

- August 21, 2018 , by Maagulf
ఈద్‌ అల్‌ అధా ప్రార్థనల్లో పాల్గొన్న యూఏఈ లీడర్స్‌

యూఏఈ:యూఏఈ లీడర్స్‌, అలాగే పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా జరిగిన ఈద్‌ అల్‌ అధా వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్‌ అల్‌ అధా ప్రారంభం నేపథ్యంలో ఆయా ప్రముఖులు, ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌తో కలిసి షేక్‌ రషీద్‌ బిన్‌ సయీద్‌ మాస్క్‌ (జబీల్‌లో)లో ప్రార్థనలు నిర్వహించారు. అబుదాబీలో క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌, ఈద్‌ ప్రార్థనల్ని అల్‌ బతీన్‌లోని సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ ది ఫస్ట్‌ మాస్క్‌లో ప్రార్థనల్ని నిర్వహించడం జరిగింది. అజ్మన్‌ రూలర్‌ షేక్‌ హుమైద్‌, షేక్‌ రషీద్‌ బిన్‌ హుమైద్‌ మాస్క్‌లో ఈద్‌ ప్రార్థనలు చేయడం జరిగింది. రస్‌ అల్‌ ఖైమా రూలర్‌ షేక్‌ సాద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి, ఖుజామ్‌లోని ఈద్‌ గ్రాండ్‌ ముసల్లాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు ప్రముఖులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రాండ్‌ షేక్‌ జాయెద్‌ మాస్క్‌లో ఫుజారియా రూలర్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షర్కి ప్రార్థనలు నిర్వహించారు. రూలర్స్‌ అంతా ఒకరికి ఒకరు ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com