యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా
- August 22, 2018
యూఏఈ:వరదల కారణంగా విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకు రాగా, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 100 మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కేరళకు ప్రకటించింది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు కూడా. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల్లో 80 శాతం మంది కేరళీయులే. ఇదిలా ఉంటే, మాల్దీవ్స్ ప్రభుత్వం 50,000 డాలర్లను కేరళ వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి సైతం కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోంది. అయితే విదేశాల నుంచి అందే సాయాన్ని తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!