యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా

- August 22, 2018 , by Maagulf
యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా

యూఏఈ:వరదల కారణంగా విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం ముందుకు రాగా, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 100 మిలియన్‌ డాలర్స్‌ (సుమారు 700 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కేరళకు ప్రకటించింది. అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధృవీకరించారు కూడా. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల్లో 80 శాతం మంది కేరళీయులే. ఇదిలా ఉంటే, మాల్దీవ్స్‌ ప్రభుత్వం 50,000 డాలర్లను కేరళ వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి సైతం కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోంది. అయితే విదేశాల నుంచి అందే సాయాన్ని తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com