ఖతారీలకు కొత్త వీసాల్లేవ్: బహ్రెయిన్
- August 22, 2018
బహ్రెయిన్:ఖతారీ జాతీయులకు కొత్త వీసాల జారీని నిలుపుదల చేస్తున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే, బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నవారికి, ఇప్పటికే వీసా పొందిన ఖతారీలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది వుండబోదని మినిస్ట్రీ తెలియజేస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ మరియు ఈజిప్ట్ 2017 జూన్ నుంచి ఖతార్తో డిప్లమాటిక్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ ఒప్పందాల్ని రద్దు చేసుకున్న సంగతి తెల్సిందే. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఖతార్ని ఈ దేశాలు దూరం పెట్టాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఖతారీ జాతీయులపై ఎంట్రీ వీసాల్ని జారీ చేస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. మామూలుగా అయితే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ఆరు దేశాలకు చెందినవారు జీసీసీ పరిధిలో కేవలం ఐడెంటిటీ కార్డుతో ప్రయాణం చేసే వీలుంటుంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









