ఖతారీలకు కొత్త వీసాల్లేవ్: బహ్రెయిన్
- August 22, 2018
బహ్రెయిన్:ఖతారీ జాతీయులకు కొత్త వీసాల జారీని నిలుపుదల చేస్తున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే, బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నవారికి, ఇప్పటికే వీసా పొందిన ఖతారీలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది వుండబోదని మినిస్ట్రీ తెలియజేస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ మరియు ఈజిప్ట్ 2017 జూన్ నుంచి ఖతార్తో డిప్లమాటిక్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ ఒప్పందాల్ని రద్దు చేసుకున్న సంగతి తెల్సిందే. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఖతార్ని ఈ దేశాలు దూరం పెట్టాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఖతారీ జాతీయులపై ఎంట్రీ వీసాల్ని జారీ చేస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. మామూలుగా అయితే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ఆరు దేశాలకు చెందినవారు జీసీసీ పరిధిలో కేవలం ఐడెంటిటీ కార్డుతో ప్రయాణం చేసే వీలుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







