అమెరికా వ్యాప్తంగా ఖైదీల సమ్మె ప్రారంభం
- August 22, 2018
వాషింగ్టన్ : అమెరికా జైళ్ళలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖైదీలు మంగళవారం నుండి 19 రోజుల పాటు సమ్మె ప్రారంభించారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితుల పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బానిస తరహాలో తమ చేత పనులు చేయించుకుంటున్నారని, పైగా రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను తొలగిస్తున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. జైళ్ళలో తమ పరిస్థితులను సవాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 'జైల్హౌస్ లాయర్స్ స్పీక్' అనే జైలు సంస్థ ఈ సమ్మెకు నాయకత్వం వహించింది. ఇటీవల దక్షిణ కరోలినాలో లీ కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్లో ఘర్షణలు జరిగి ఏడుగురు ఖైదీలు మరణించగా, 17మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. దారుణ పరిస్థితులకు పెట్టింది పేరైన ఈ జైల్లో గంటల తరబడి హింసాకాండ కొనసాగినా సిబ్బంది పట్టించుకోలేదు. గాయపడిన వారికి చికిత్స కూడా అందలేదు. దీంతో నిరసన తెలిపిన ఖైదీలు ముందుగా తమ పనులను విరమించి నిరసన తెలియచేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









