అమెరికా వ్యాప్తంగా ఖైదీల సమ్మె ప్రారంభం
- August 22, 2018
వాషింగ్టన్ : అమెరికా జైళ్ళలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖైదీలు మంగళవారం నుండి 19 రోజుల పాటు సమ్మె ప్రారంభించారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితుల పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బానిస తరహాలో తమ చేత పనులు చేయించుకుంటున్నారని, పైగా రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను తొలగిస్తున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. జైళ్ళలో తమ పరిస్థితులను సవాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 'జైల్హౌస్ లాయర్స్ స్పీక్' అనే జైలు సంస్థ ఈ సమ్మెకు నాయకత్వం వహించింది. ఇటీవల దక్షిణ కరోలినాలో లీ కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్లో ఘర్షణలు జరిగి ఏడుగురు ఖైదీలు మరణించగా, 17మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. దారుణ పరిస్థితులకు పెట్టింది పేరైన ఈ జైల్లో గంటల తరబడి హింసాకాండ కొనసాగినా సిబ్బంది పట్టించుకోలేదు. గాయపడిన వారికి చికిత్స కూడా అందలేదు. దీంతో నిరసన తెలిపిన ఖైదీలు ముందుగా తమ పనులను విరమించి నిరసన తెలియచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







