బహ్రెయిన్:తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరమే!
- August 23, 2018
బహ్రెయిన్:ప్రయాణీకులు తమకు తెలియకుండా నిషేధిత వస్తువులను రవాణా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. బహ్రెయిన్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2017లో 1,286 కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ని స్వాధీనం చేసుకుంది. వీటిల్లో నార్కోటిక్ డ్రగ్స్, పిల్స్, జెమ్స్టోన్స్, పెరల్స్, వెపన్స్, అమ్యూనిషన్, ఆల్కహాల్, కరెన్సీస్, టొబాకో వంటివి కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో వున్నాయి. ఈ సందర్భంగా పలు అరెస్టులు జరిగాయనీ, అయితే అలా అరెస్టయినవారిలో చాలామందికి తాము అసలు వాటిని రవాణా చేస్తున్నామనే విషయం కూడా తెలియదని కస్టమ్స్ ఇన్స్పెక్షన్స్ అండ్ కస్టమ్స్ ఎఫైర్ డైరెక్టర్ జనరల్ జనరల్ అబ్దుల్లా హమాద్ అల్ కుబైసి చెప్పారు. ఈ నేపథ్యంలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై ప్రయాణీకుల్లో మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఎలాంటి వస్తువుల్నీ తమతోపాటు తీసుకెళ్ళరాదని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







