బహ్రెయిన్:తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరమే!
- August 23, 2018
బహ్రెయిన్:ప్రయాణీకులు తమకు తెలియకుండా నిషేధిత వస్తువులను రవాణా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. బహ్రెయిన్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2017లో 1,286 కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ని స్వాధీనం చేసుకుంది. వీటిల్లో నార్కోటిక్ డ్రగ్స్, పిల్స్, జెమ్స్టోన్స్, పెరల్స్, వెపన్స్, అమ్యూనిషన్, ఆల్కహాల్, కరెన్సీస్, టొబాకో వంటివి కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో వున్నాయి. ఈ సందర్భంగా పలు అరెస్టులు జరిగాయనీ, అయితే అలా అరెస్టయినవారిలో చాలామందికి తాము అసలు వాటిని రవాణా చేస్తున్నామనే విషయం కూడా తెలియదని కస్టమ్స్ ఇన్స్పెక్షన్స్ అండ్ కస్టమ్స్ ఎఫైర్ డైరెక్టర్ జనరల్ జనరల్ అబ్దుల్లా హమాద్ అల్ కుబైసి చెప్పారు. ఈ నేపథ్యంలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై ప్రయాణీకుల్లో మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఎలాంటి వస్తువుల్నీ తమతోపాటు తీసుకెళ్ళరాదని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







