బహ్రెయిన్:తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరమే!
- August 23, 2018
బహ్రెయిన్:ప్రయాణీకులు తమకు తెలియకుండా నిషేధిత వస్తువులను రవాణా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. బహ్రెయిన్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2017లో 1,286 కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ని స్వాధీనం చేసుకుంది. వీటిల్లో నార్కోటిక్ డ్రగ్స్, పిల్స్, జెమ్స్టోన్స్, పెరల్స్, వెపన్స్, అమ్యూనిషన్, ఆల్కహాల్, కరెన్సీస్, టొబాకో వంటివి కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో వున్నాయి. ఈ సందర్భంగా పలు అరెస్టులు జరిగాయనీ, అయితే అలా అరెస్టయినవారిలో చాలామందికి తాము అసలు వాటిని రవాణా చేస్తున్నామనే విషయం కూడా తెలియదని కస్టమ్స్ ఇన్స్పెక్షన్స్ అండ్ కస్టమ్స్ ఎఫైర్ డైరెక్టర్ జనరల్ జనరల్ అబ్దుల్లా హమాద్ అల్ కుబైసి చెప్పారు. ఈ నేపథ్యంలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై ప్రయాణీకుల్లో మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఎలాంటి వస్తువుల్నీ తమతోపాటు తీసుకెళ్ళరాదని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!