ప్రముఖ జర్నలిస్ట్ మృతికి ప్రధాని సంతాపం
- August 23, 2018
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, రచయిత కుల్దీప్ నాయర్ మృతిచెందారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సిల్కోట్లో 1923 ఆగస్ట్ 4లో జన్మించారు. లా డిగ్రీ పట్టాను దేశ విభజనకు ముందు లాహోర్ నుండి పొందారు. ' బిట్వీన్ ద లైన్స్' పేరుతో కాలమ్ దాదాపు 80 పత్రికలలో ప్రచురితమైంది. జర్నలిస్ట్గానే కాక మానవహక్కుల ఉద్యమకారుడిగగా కుల్దీప్ బాధ్యతలు నిర్వహించారు. 1990లో బ్రిటన్లో హైకమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమైంది. విభజన అనంతరం కమ్యూనిటీల మధ్య నమ్మకాలు కూలిపోవడాన్ని గురించి రచించారు. దేశ విభజన సమయంలో పంజాబ్ నుండి ఆయన బలవంతంగా ఢిల్లీకి చేరుకున్నారు.
కుల్దీప్ నాయర్ తమ కాలానికి చెందిన మేధో దిగ్గజమని, నిర్భయమైన తన అభిప్రాయాలతో అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్గా కొనసాగారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఆయన చూపిన ధైర్యం, ప్రజలకు సేవచేయడం, మెరుగైన దేశం కోసం ఆయన చూపిన నిబద్ధత ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







