ప్రముఖ జర్నలిస్ట్ మృతికి ప్రధాని సంతాపం
- August 23, 2018
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, రచయిత కుల్దీప్ నాయర్ మృతిచెందారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సిల్కోట్లో 1923 ఆగస్ట్ 4లో జన్మించారు. లా డిగ్రీ పట్టాను దేశ విభజనకు ముందు లాహోర్ నుండి పొందారు. ' బిట్వీన్ ద లైన్స్' పేరుతో కాలమ్ దాదాపు 80 పత్రికలలో ప్రచురితమైంది. జర్నలిస్ట్గానే కాక మానవహక్కుల ఉద్యమకారుడిగగా కుల్దీప్ బాధ్యతలు నిర్వహించారు. 1990లో బ్రిటన్లో హైకమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమైంది. విభజన అనంతరం కమ్యూనిటీల మధ్య నమ్మకాలు కూలిపోవడాన్ని గురించి రచించారు. దేశ విభజన సమయంలో పంజాబ్ నుండి ఆయన బలవంతంగా ఢిల్లీకి చేరుకున్నారు.
కుల్దీప్ నాయర్ తమ కాలానికి చెందిన మేధో దిగ్గజమని, నిర్భయమైన తన అభిప్రాయాలతో అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్గా కొనసాగారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఆయన చూపిన ధైర్యం, ప్రజలకు సేవచేయడం, మెరుగైన దేశం కోసం ఆయన చూపిన నిబద్ధత ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







