ప్రముఖ జర్నలిస్ట్ మృతికి ప్రధాని సంతాపం
- August 23, 2018
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, రచయిత కుల్దీప్ నాయర్ మృతిచెందారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సిల్కోట్లో 1923 ఆగస్ట్ 4లో జన్మించారు. లా డిగ్రీ పట్టాను దేశ విభజనకు ముందు లాహోర్ నుండి పొందారు. ' బిట్వీన్ ద లైన్స్' పేరుతో కాలమ్ దాదాపు 80 పత్రికలలో ప్రచురితమైంది. జర్నలిస్ట్గానే కాక మానవహక్కుల ఉద్యమకారుడిగగా కుల్దీప్ బాధ్యతలు నిర్వహించారు. 1990లో బ్రిటన్లో హైకమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమైంది. విభజన అనంతరం కమ్యూనిటీల మధ్య నమ్మకాలు కూలిపోవడాన్ని గురించి రచించారు. దేశ విభజన సమయంలో పంజాబ్ నుండి ఆయన బలవంతంగా ఢిల్లీకి చేరుకున్నారు.
కుల్దీప్ నాయర్ తమ కాలానికి చెందిన మేధో దిగ్గజమని, నిర్భయమైన తన అభిప్రాయాలతో అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్గా కొనసాగారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఆయన చూపిన ధైర్యం, ప్రజలకు సేవచేయడం, మెరుగైన దేశం కోసం ఆయన చూపిన నిబద్ధత ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







