'ఫేస్ బుక్' వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్..!
- August 23, 2018ఇటీవలి కాలంలో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్' డేటా చౌర్యం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతి లేకుండా.. పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను రహస్యంగా వినియోగించుకున్న వైనం కలకలం రేపింది. దీంతో ఫేస్ బుక్ లో డేటా భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో చాలామంది ఫేస్ బుక్ ఖాతాలను డిలీట్ కూడా చేసుకున్నారు.
ఇది మరువక ముందే మరో 'ఫేస్ బుక్' డేటా స్కాం వెలుగులోకి వచ్చింది. 'ఫేస్ బుక్' థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎంత ముప్పు ఉందో మరోసారి బయటపడింది. 'మై పర్సనాలిటీ' అనే థర్డ్ పార్టీ యాప్.. సుమారు 40లక్షల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్ బుక్ విచారణలో తేలటంతో ఈ యాప్ ను ఫేస్ బుక్ తొలగించింది.
ఈ యాప్ 2012కు ముందు బాగా యాక్టివ్ గా ఉండేది. ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది. దీంతో 'మై పర్సనాలిటీ అనే యాప్ ను ఫేస్ బుక్ నుంచి నిషేధిస్తున్నాం' అని ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాం తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్ పై ఫేస్ బుక్ విచారణ జరిపింది. దీంతో అనుమానాస్పదంగా అనిపించిన 400 యాప్స్ ను తొలిగించారు. కాగా, యాప్స్ పై విచారణ కొనసాగిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్