ఫ్లిప్కార్ట్ నుంచి మరో బంపర్ ఆఫర్ సేల్
- August 23, 2018ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఒక సేల్ తర్వతా మరో సేల్ నిర్వహిస్తూనే ఉంది. ఇటీవలే బిగ్ ఫ్రీడం సేల్ ముగిసింది. ఈ సేల్ ముగిసిన రెండు వారాల్లోనే ఫ్లిప్ కార్ట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ర్ సేల్’ పేరుతో మరో సేల్ను ప్రారంభించనుంది. ఈ సేల్లో పాపులర్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్టాప్లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్ను ఫ్లిప్కార్ట్ ప్రకటిస్తుంది. ఆగస్టు 25 నుంచి ఈ సేల్ లైవ్లోకి వస్తుండగా.. ప్లస్ సభ్యులకు ఆగస్టు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది.
* రెడ్మి 5ఏ స్మార్ట్ఫోన్ ఆగస్టు 25వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు సేల్కు వస్తుంది.
* శాంసంగ్, ఎల్జీ, వర్పూల్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లపై 30 శాతం తగ్గింపు.
* హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ (ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది).
* ల్యాప్టాప్లపై అదనంగా రూ.2వేలు తగ్గింపు.
* గానా ప్లస్కు 6 నెలల సబ్స్క్రిప్షన్, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి రూ.550 ఇన్స్టాంట్ డిస్కౌంట్.
* బుక్మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి రూ.100 తగ్గింపును ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు కాస్త ముందుగా ఈ సేల్ అందుబాటులోకి రావడమే కాకుండా.. ఫ్రీ డెలివరీ, ప్రియారిటీ కస్టమర్ సపోర్టు కూడ లభించనున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్