'ఫేస్ బుక్' వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్..!
- August 23, 2018
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్' డేటా చౌర్యం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతి లేకుండా.. పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను రహస్యంగా వినియోగించుకున్న వైనం కలకలం రేపింది. దీంతో ఫేస్ బుక్ లో డేటా భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో చాలామంది ఫేస్ బుక్ ఖాతాలను డిలీట్ కూడా చేసుకున్నారు.
ఇది మరువక ముందే మరో 'ఫేస్ బుక్' డేటా స్కాం వెలుగులోకి వచ్చింది. 'ఫేస్ బుక్' థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎంత ముప్పు ఉందో మరోసారి బయటపడింది. 'మై పర్సనాలిటీ' అనే థర్డ్ పార్టీ యాప్.. సుమారు 40లక్షల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్ బుక్ విచారణలో తేలటంతో ఈ యాప్ ను ఫేస్ బుక్ తొలగించింది.
ఈ యాప్ 2012కు ముందు బాగా యాక్టివ్ గా ఉండేది. ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది. దీంతో 'మై పర్సనాలిటీ అనే యాప్ ను ఫేస్ బుక్ నుంచి నిషేధిస్తున్నాం' అని ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాం తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్ పై ఫేస్ బుక్ విచారణ జరిపింది. దీంతో అనుమానాస్పదంగా అనిపించిన 400 యాప్స్ ను తొలిగించారు. కాగా, యాప్స్ పై విచారణ కొనసాగిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







