కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్ బి.ఆర్.శెట్టి
- August 23, 2018
అబుదాబీ:అబుదాబీకి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ బి.ఆర్.శెట్టి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన 40 మిలియన్ రూపాయల (2.1 మిలియన్ దిర్హామ్లు) చెక్ని ముఖ్యమంత్రికి అందజేశారు శెట్టి. ఇది కాకుండా ఇంతకు ముందు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్కి 5 మిలియన్ దిర్హామ్లను కేరళ రిలీఫ్ ఫండ్లో భాగంగా బిఆర్ శెట్టి అందజేయడం జరిగింది. యూఏఈ తరఫున 100 మిలియన్ డాలర్లను కేరళకు సహాయంగా అందజేసేందుకు సన్నాహాలు జరగగా, యూఏఈ సహాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన దరిమిలా, బిఆర్ శెట్టి స్వయంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి తాజా సాయాన్ని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రజలు సంఘటితంగా వుండి పెను విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నారని శెట్టి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







