కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్‌ బి.ఆర్‌.శెట్టి

- August 23, 2018 , by Maagulf
కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్‌ బి.ఆర్‌.శెట్టి

అబుదాబీ:అబుదాబీకి చెందిన వ్యాపారవేత్త డాక్టర్‌ బి.ఆర్‌.శెట్టి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన 40 మిలియన్‌ రూపాయల (2.1 మిలియన్‌ దిర్హామ్‌లు) చెక్‌ని ముఖ్యమంత్రికి అందజేశారు శెట్టి. ఇది కాకుండా ఇంతకు ముందు ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఫౌండేషన్‌కి 5 మిలియన్‌ దిర్హామ్‌లను కేరళ రిలీఫ్‌ ఫండ్‌లో భాగంగా బిఆర్‌ శెట్టి అందజేయడం జరిగింది. యూఏఈ తరఫున 100 మిలియన్‌ డాలర్లను కేరళకు సహాయంగా అందజేసేందుకు సన్నాహాలు జరగగా, యూఏఈ సహాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన దరిమిలా, బిఆర్‌ శెట్టి స్వయంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి తాజా సాయాన్ని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రజలు సంఘటితంగా వుండి పెను విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నారని శెట్టి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com