కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్ బి.ఆర్.శెట్టి
- August 23, 2018
అబుదాబీ:అబుదాబీకి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ బి.ఆర్.శెట్టి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన 40 మిలియన్ రూపాయల (2.1 మిలియన్ దిర్హామ్లు) చెక్ని ముఖ్యమంత్రికి అందజేశారు శెట్టి. ఇది కాకుండా ఇంతకు ముందు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్కి 5 మిలియన్ దిర్హామ్లను కేరళ రిలీఫ్ ఫండ్లో భాగంగా బిఆర్ శెట్టి అందజేయడం జరిగింది. యూఏఈ తరఫున 100 మిలియన్ డాలర్లను కేరళకు సహాయంగా అందజేసేందుకు సన్నాహాలు జరగగా, యూఏఈ సహాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన దరిమిలా, బిఆర్ శెట్టి స్వయంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి తాజా సాయాన్ని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రజలు సంఘటితంగా వుండి పెను విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నారని శెట్టి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









