కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్ బి.ఆర్.శెట్టి
- August 23, 2018
అబుదాబీ:అబుదాబీకి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ బి.ఆర్.శెట్టి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన 40 మిలియన్ రూపాయల (2.1 మిలియన్ దిర్హామ్లు) చెక్ని ముఖ్యమంత్రికి అందజేశారు శెట్టి. ఇది కాకుండా ఇంతకు ముందు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్కి 5 మిలియన్ దిర్హామ్లను కేరళ రిలీఫ్ ఫండ్లో భాగంగా బిఆర్ శెట్టి అందజేయడం జరిగింది. యూఏఈ తరఫున 100 మిలియన్ డాలర్లను కేరళకు సహాయంగా అందజేసేందుకు సన్నాహాలు జరగగా, యూఏఈ సహాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన దరిమిలా, బిఆర్ శెట్టి స్వయంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి తాజా సాయాన్ని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రజలు సంఘటితంగా వుండి పెను విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నారని శెట్టి చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







