ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం..
- August 25, 2018
కోల్కత:అందరిలా ఫోటోలు ఎందుకు తీయాలి.. కొంచెం కొత్తగా ట్రైం చేద్దాం అనుకున్నాడో ఏమో కానీ ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫోటో అతడి ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. కోల్కతకు చెందిన ప్రీతమ్ మిత్రా అనే ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఓ మోడలతో ఫోటోషూట్ నిర్వహించాడు. అయితే అతను అందరిలా కాకుండా రోటిన్కు కాస్త భిన్నంగా ఫోటో షూట్ చేశాడు. మోడల్ను పెళ్లికూతురిగా, బెంగాల్ స్టైల్లో పెద్ద బొట్టుతో అలంకరించి ఫోటోలు తీశాడు.. అయితే దీంట్లో తప్పు ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే అతని వైవిధ్యాన్ని కనబరిచాడు. పెళ్లికూతురు అలంకారంలో మోడల్ను న్యూడ్ ఫోటోలు తీశాడు.
ఆ మోడల్ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో ఫేసుని కవర్ చేశాడు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్ని జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్ చేశాడు. అంతటితో ఆగలేదు ఈ ఫోటోగ్రాఫర్. తన ప్రతిభను నలుగురికీ చూపించలనుకున్నాడో ఏమో.. ఈ ఫోటోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. న్యూడ్గా ఉన్న ఈ ఫోటో తన ఫేసుబుక్ పేజీలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదంగా మారింది.
ఈ ఫొటో బెంగాల్ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేదిగా ఉందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను.. ఫేస్బుక్ పేజీనుంచి తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారంటూ.. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు ఫోటోగ్రాఫర్ ప్రీతమ్.
ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. రొటీన్కి భిన్నంగా ఏదో చేద్దామని.. ఇంకేదో చేసి.. ఫోటోగ్రాఫర్ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు కానీ అది కాస్తా రివర్స్ అయిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి