డబ్ల్యుపిఎస్‌ కింద 850 ఉద్యోగుల నమోదు

- December 16, 2015 , by Maagulf
డబ్ల్యుపిఎస్‌ కింద 850 ఉద్యోగుల నమోదు


అహ్లి బ్యాంక్‌ అతి త్వరలో పేరోల్‌ కార్డ్‌ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డ్‌ 6000 ఖతారీ రియాల్స్‌ వరకూ వేతనాన్ని సంపాదించే ఉద్యోగులకు అందజేస్తారు. డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, అహ్లిబ్యాంక్‌ ఆండ్రూ మెక్‌కెనిచీ మాట్లాడుతూ, ఈ కార్డ్‌ అన్ని ఏటీఎంల వద్ద, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్స్‌ వద్దా ఉపయోగించవచ్చనీ, వీసా లోగోతో కార్డులు రూపొందుతాయనీ, ఖతార్‌ మరియు ఓవర్‌సీస్‌లో వినియోగించుకోవచ్చని తెలిపారు. 850 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్డ్‌ కోసం నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 20 వేల లావాదేవీలు జరిగాయని ఆయన చెప్పారు. కొత్త విధానం ద్వారా సేఫ్‌ బ్యాంకింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com