ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పి.వి సింధు
- August 27, 2018
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్లో ఫైనల్స్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సింధు సెమీస్లో 21-17,15-21, 21-10 స్కోర్తో యమగుచిపై విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ సింధు గెలిస్తే… తర్వాత పుంజుకున్న యమగుచి స్కోర్ సమం చేసింది. అయితే మ్యాచ్ డిసైడింగ్ గేమ్లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తనదైన నెట్గేమ్తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు , వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్తో తలపడనుంది. అటు మరో సెమీస్లో పరాజయం పాలైన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









