ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పి.వి సింధు
- August 27, 2018
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్లో ఫైనల్స్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సింధు సెమీస్లో 21-17,15-21, 21-10 స్కోర్తో యమగుచిపై విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ సింధు గెలిస్తే… తర్వాత పుంజుకున్న యమగుచి స్కోర్ సమం చేసింది. అయితే మ్యాచ్ డిసైడింగ్ గేమ్లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తనదైన నెట్గేమ్తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు , వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్తో తలపడనుంది. అటు మరో సెమీస్లో పరాజయం పాలైన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి