దుబాయ్:కేరళకు వెళ్ళే ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడే

- August 27, 2018 , by Maagulf
దుబాయ్:కేరళకు వెళ్ళే ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడే

దుబాయ్:వరదలతో విలవిల్లాడిన కేరళకు అన్ని వైపుల నుంచీ సంఘీభావం లభిస్తోంది. దుబాయ్‌కి చెందిన ఓ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ, కేరళకు వెళ్ళే తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. దర్‌ అల్‌ తకాఫుల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమువుతోంది. ఇలాంటి సందర్భాల్లో మానవతా కోణంలో ఆలోచించాల్సి వుంటుందనీ, కేరళలో వున్న తమ కుటుంబీకుల పరిస్థితిపై దుబాయ్‌లో వున్న కేరళీయుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదని, అందుకే తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని దర్‌ అల్‌ తకాఫుల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌ సలెహ్‌ అల్‌ హాషిమి చెప్పారు. దీంతోపాటుగా తమ కంపెనీ ఇప్పటికే కేరళ వరద బాధితుల కొసం డొనేషన్‌ చేసినట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com