దుబాయ్:కేరళకు వెళ్ళే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే
- August 27, 2018
దుబాయ్:వరదలతో విలవిల్లాడిన కేరళకు అన్ని వైపుల నుంచీ సంఘీభావం లభిస్తోంది. దుబాయ్కి చెందిన ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కేరళకు వెళ్ళే తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. దర్ అల్ తకాఫుల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమువుతోంది. ఇలాంటి సందర్భాల్లో మానవతా కోణంలో ఆలోచించాల్సి వుంటుందనీ, కేరళలో వున్న తమ కుటుంబీకుల పరిస్థితిపై దుబాయ్లో వున్న కేరళీయుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదని, అందుకే తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని దర్ అల్ తకాఫుల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ సలెహ్ అల్ హాషిమి చెప్పారు. దీంతోపాటుగా తమ కంపెనీ ఇప్పటికే కేరళ వరద బాధితుల కొసం డొనేషన్ చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







