ఇండియా:ఆరు వేల స్టేషన్లలో వైఫై సౌకర్యం
- August 28, 2018
న్యూఢిల్లీ: త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆరు వేల రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వివరించారు.
'దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం వల్ల ప్రయాణికులకులతో పాటు వ్యవసాయ పనులు చేసే వారికి, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద'న్నారు. అంతే కాకుండా విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమని అన్నారు.'
దీనితో పాటుగా త్వరలోనే విమానాల మాదిరిగా రైల్వే కోచ్లలో కూడా బయో వ్యాక్యుమ్ టాయిలెట్లను అమర్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రైల్వే హెల్ప్ లైన్ సర్వీస్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కాకపోతే దానిని కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే ట్రాకులను పునరుద్ధరించడానికి ప్రతిపాదనలు జరిగాయని అన్నారు. ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి