నందమూరి కుటుంబానికి శాపంగా మారిన రోడ్డు ప్రమాదాలు..
- August 28, 2018
తెలంగాణ:నల్గొండలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ యాక్సిడెంట్తో హరికృష్ణ బాగా కుంగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్నను కోల్పోయిన బాధను ఇప్పటికీ దిగమింగుకోలేక పోతున్నామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాహనాలు జాగ్రత్తగా నడపాలని తన సినిమాల ద్వారా సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో షాక్కి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా తండ్రిని కోల్పోయిన బాధలో కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ఆయన అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ప్రమాదాల్లో సోదరుడు, తండ్రిని కోల్పోవడంతో అంతులేని విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







