పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు
- August 28, 2018
ఓస్లో : నార్వేకి చెందిన పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకర్త క్రిస్టిన్ ఫాస్పై వారం రోజుల్లో రెండుసార్లు ఇజ్రాయిలీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. గత శనివారం ప్రదర్శన జరుగుతుండగా కఫిర్ కద్దుమ్ ప్రాంతంలో ఆమెపై కాల్పులు జరిగాయి. వృద్ధుడైన ఓ పాలస్తీనా జాతీయుడిని కారు వద్దకు తీసుకెళ్ళడానికి మరో కార్యకర్తతో కలిసి ఫాస్ నడిచి వెళుతుండగా, కారును అడ్డంగా పెట్టుకున్న సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. కాగా, ఇజ్రాయిలీలు బల ప్రయోగానికి దిగకుండా నివారించేందుకు గానూ పాలస్తీనా నిరసనలకు తరచుగా అంతర్జాతీయ కార్యకర్తలు హాజరవుతూ వుంటారు. 'మాపై తుపాకీ ఎక్కుపెట్టడం మీకు ప్రమాదకరం' అని ఫాస్ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమెపై రెండోసారి కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం వివరించాలని నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఇజ్రాయిల్ విదేశాంగ శాఖను కోరింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







