పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు
- August 28, 2018
ఓస్లో : నార్వేకి చెందిన పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకర్త క్రిస్టిన్ ఫాస్పై వారం రోజుల్లో రెండుసార్లు ఇజ్రాయిలీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. గత శనివారం ప్రదర్శన జరుగుతుండగా కఫిర్ కద్దుమ్ ప్రాంతంలో ఆమెపై కాల్పులు జరిగాయి. వృద్ధుడైన ఓ పాలస్తీనా జాతీయుడిని కారు వద్దకు తీసుకెళ్ళడానికి మరో కార్యకర్తతో కలిసి ఫాస్ నడిచి వెళుతుండగా, కారును అడ్డంగా పెట్టుకున్న సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. కాగా, ఇజ్రాయిలీలు బల ప్రయోగానికి దిగకుండా నివారించేందుకు గానూ పాలస్తీనా నిరసనలకు తరచుగా అంతర్జాతీయ కార్యకర్తలు హాజరవుతూ వుంటారు. 'మాపై తుపాకీ ఎక్కుపెట్టడం మీకు ప్రమాదకరం' అని ఫాస్ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమెపై రెండోసారి కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం వివరించాలని నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఇజ్రాయిల్ విదేశాంగ శాఖను కోరింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







