పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు
- August 28, 2018
ఓస్లో : నార్వేకి చెందిన పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకర్త క్రిస్టిన్ ఫాస్పై వారం రోజుల్లో రెండుసార్లు ఇజ్రాయిలీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. గత శనివారం ప్రదర్శన జరుగుతుండగా కఫిర్ కద్దుమ్ ప్రాంతంలో ఆమెపై కాల్పులు జరిగాయి. వృద్ధుడైన ఓ పాలస్తీనా జాతీయుడిని కారు వద్దకు తీసుకెళ్ళడానికి మరో కార్యకర్తతో కలిసి ఫాస్ నడిచి వెళుతుండగా, కారును అడ్డంగా పెట్టుకున్న సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. కాగా, ఇజ్రాయిలీలు బల ప్రయోగానికి దిగకుండా నివారించేందుకు గానూ పాలస్తీనా నిరసనలకు తరచుగా అంతర్జాతీయ కార్యకర్తలు హాజరవుతూ వుంటారు. 'మాపై తుపాకీ ఎక్కుపెట్టడం మీకు ప్రమాదకరం' అని ఫాస్ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమెపై రెండోసారి కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం వివరించాలని నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఇజ్రాయిల్ విదేశాంగ శాఖను కోరింది.
తాజా వార్తలు
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు









