పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు
- August 28, 2018
ఓస్లో : నార్వేకి చెందిన పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకర్త క్రిస్టిన్ ఫాస్పై వారం రోజుల్లో రెండుసార్లు ఇజ్రాయిలీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. గత శనివారం ప్రదర్శన జరుగుతుండగా కఫిర్ కద్దుమ్ ప్రాంతంలో ఆమెపై కాల్పులు జరిగాయి. వృద్ధుడైన ఓ పాలస్తీనా జాతీయుడిని కారు వద్దకు తీసుకెళ్ళడానికి మరో కార్యకర్తతో కలిసి ఫాస్ నడిచి వెళుతుండగా, కారును అడ్డంగా పెట్టుకున్న సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. కాగా, ఇజ్రాయిలీలు బల ప్రయోగానికి దిగకుండా నివారించేందుకు గానూ పాలస్తీనా నిరసనలకు తరచుగా అంతర్జాతీయ కార్యకర్తలు హాజరవుతూ వుంటారు. 'మాపై తుపాకీ ఎక్కుపెట్టడం మీకు ప్రమాదకరం' అని ఫాస్ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమెపై రెండోసారి కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం వివరించాలని నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఇజ్రాయిల్ విదేశాంగ శాఖను కోరింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!