కేంద్రీయ విద్యాలయాల్లో 8339 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- August 29, 2018
కేంద్రీయ విద్యాలయాల్లో 8339 టీచర్ పోస్టుల భర్తీకీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( టీజీటీ), ప్రైమరీ టీచర్, గ్రూప్ బీ మరియు ఇతరత్ర పోస్టులు భర్తీ చేయనుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 24వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ సెప్టెంబర్ 13, 2018.
సంస్థ పేరు : కేంద్రీయ విద్యాలయ సంఘటన్
మొత్తం పోస్టుల సంఖ్య : 8339
పోస్టు పేరు : టీజీటీ, ప్రైమరీ టీచర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 13 సెప్టెంబర్, 2018
ఖాళీల వివరాలు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( టీజీటీ) : 1900 పోస్టులు
ప్రైమరీ టీచర్(పీఆర్టీ) (గ్రూప్ బీ) : 5300 పోస్టులు
విద్యార్హతలు
->టీజీటీ : సంబంధింత సబజెక్టులో 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, సీటెట్ పరీక్ష పాసై ఉండాలి
->ప్రైమరీ టీచర్ : 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ,సీటెట్ పాస్ కావడంతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2ఏళ్ల డిప్లొమా
సెప్టెంబర్ 30 నాటికి వయస్సు
టీజీటీ : 35 ఏళ్లు
ప్రైమరీ టీచర్ : 30ఏళ్లు
వేతనాలు
టీజీటీ: నెలకు రూ. 44900 - 142400/-
ప్రైమరీ టీచర్ : నెలకు రూ. 35400 - 112400/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు : ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ. 750/-
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 24 ఆగష్టు 2018
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ : 13 సెప్టెంబర్ 2018
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/PS9cUg?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!









