హరికృష్ణ ఇంటికి చేరుకున్న ఆయన పార్థివ దేహం

- August 29, 2018 , by Maagulf
హరికృష్ణ ఇంటికి చేరుకున్న ఆయన పార్థివ దేహం

హైదరాబాద్:మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి ఆయన పార్థివ దేహం చేరుకుంది.. ఆయనను చివరి సారి చూసేందుకు భారీగా రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు ఇంటికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు అంతా ఇంటికి చేరుకుంటున్నారు. ఆంబులెన్స్‌ నుంచి కిందకు దిగిన హరికృష్ణ భౌతిక కాయాన్ని చూడగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు.

కామినేని ఆస్పత్రి నుంచి ఆంబులెన్స్‌లో పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.. ఆంబులెన్స్‌కు ముందు ఒకవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌.. మరోవైపు కళ్యాణ్‌ రామ్‌ నడుస్తూ కనిపించారు. ఇంతకాలం తమ వెంట ఉండి నడిపించిన తండ్రి మరణాన్ని ఇద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. తన్నుకొస్తున్న ధుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఆంబులెన్స్‌ వచ్చిన కాన్వాయ్‌తో పాటు ఇంటికి చేరుకున్నారు.. వైసీపీ నేత కొడాలి నాని.. ఆంబులెన్స్‌లోనే ఉండి.. పార్థివ దేహాన్ని కిందకు దింపారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com