హరికృష్ణ ఇంటికి చేరుకున్న ఆయన పార్థివ దేహం
- August 29, 2018
హైదరాబాద్:మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి ఆయన పార్థివ దేహం చేరుకుంది.. ఆయనను చివరి సారి చూసేందుకు భారీగా రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు ఇంటికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు అంతా ఇంటికి చేరుకుంటున్నారు. ఆంబులెన్స్ నుంచి కిందకు దిగిన హరికృష్ణ భౌతిక కాయాన్ని చూడగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు.
కామినేని ఆస్పత్రి నుంచి ఆంబులెన్స్లో పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.. ఆంబులెన్స్కు ముందు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్.. మరోవైపు కళ్యాణ్ రామ్ నడుస్తూ కనిపించారు. ఇంతకాలం తమ వెంట ఉండి నడిపించిన తండ్రి మరణాన్ని ఇద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. తన్నుకొస్తున్న ధుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఆంబులెన్స్ వచ్చిన కాన్వాయ్తో పాటు ఇంటికి చేరుకున్నారు.. వైసీపీ నేత కొడాలి నాని.. ఆంబులెన్స్లోనే ఉండి.. పార్థివ దేహాన్ని కిందకు దింపారు..
తాజా వార్తలు
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం









