విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు

- August 30, 2018 , by Maagulf
విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు

విమానాల్లో ప్రయాణించేవారు తనిఖీల్లో భాగంగా ఇకపై అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలు, చివరకు డబ్బు దాచుకునే పర్సులూ భద్రత సిబ్బందికి చూపాల్సిందే. ఇప్పటివరకు చేతి సామగ్రి కింద కొన్నింటిని మినహాయిస్తున్నా ఇకపై వాటినీ వదిలిపెట్టరు. ఇంతవరకు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ పీసీలు భద్రత సిబ్బంది పరిశీలన నిమిత్తం విడిగా ఒక ట్రేలో ఉంచాల్సి వస్తోంది. ఇకపై పర్సులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను విడిగా పరీక్షింపజేసుకోవాల్సిందే. కొంతమంది పెన్నుల్లో చాకుల్ని దాచి తీసుకువస్తున్నట్లు ఇటీవల బయటపడడంతో అలాంటివాటినీ తనిఖీ చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com