ఇండియా:మరింత పడిపోయిన రూపాయి విలువ

- August 30, 2018 , by Maagulf
ఇండియా:మరింత పడిపోయిన రూపాయి విలువ

ముంబయి:రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. చమురు ధరలు పెరగడంతో అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి, రూపాయి విలువ 26 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.71కి చేరుకుంది. రూపాయి నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసింది. ఈరోజు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది. మిగతా ఆసియా దేశాలపై కూడా ఈ ప్రభావం పడింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఆందోళనల ఈ రూపాయి క్షీణతకు దారితీస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com