యూ.ఏ.ఈ:పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్పై బ్యాన్ విధించాలి
- August 30, 2018
యూ.ఏ.ఈ:ఎనర్జీ డ్రింక్స్ని పిల్లలు వినియోగించకుండా బ్యాన్ విధించాలంటూ యూకేలో వెల్లువెత్తుతున్న నినాదాలకు, యూఏఈ డాక్టర్లు సైతం మద్దతు పలికారు. ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఎక్కువైందనీ, ఇది వారి ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతోందని యూఏఈకి చెందిన డాక్టర్లు చెప్పారు. మరో వైపు యూకే ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే మాట్లాడుతూ మ్రుఖ ఎనర్జీ డ్రింక్స్ని యువతరానికి చిన్న పిల్లలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యూఏఈలో ఇటీవల ఎనర్జీ డ్రింక్స్పై వ్యాట్ని 100శాతం పెంచడం, వాటి వినియోగం తగ్గించడం కోసమేనని యూఏఈకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారనీ, పలు రకాలైన రోగాల బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్పారు. ఎనర్జీ డ్రింక్స్పై బ్యాన్ విధించాల్సిందేనని యూనివర్సల్ హాస్పిటల్ డాక్టర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షానవాస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. డయాబెటిస్, హృద్రోగ సమస్యలు ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







