యూ.ఏ.ఈ:పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్పై బ్యాన్ విధించాలి
- August 30, 2018
యూ.ఏ.ఈ:ఎనర్జీ డ్రింక్స్ని పిల్లలు వినియోగించకుండా బ్యాన్ విధించాలంటూ యూకేలో వెల్లువెత్తుతున్న నినాదాలకు, యూఏఈ డాక్టర్లు సైతం మద్దతు పలికారు. ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఎక్కువైందనీ, ఇది వారి ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతోందని యూఏఈకి చెందిన డాక్టర్లు చెప్పారు. మరో వైపు యూకే ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే మాట్లాడుతూ మ్రుఖ ఎనర్జీ డ్రింక్స్ని యువతరానికి చిన్న పిల్లలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యూఏఈలో ఇటీవల ఎనర్జీ డ్రింక్స్పై వ్యాట్ని 100శాతం పెంచడం, వాటి వినియోగం తగ్గించడం కోసమేనని యూఏఈకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారనీ, పలు రకాలైన రోగాల బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్పారు. ఎనర్జీ డ్రింక్స్పై బ్యాన్ విధించాల్సిందేనని యూనివర్సల్ హాస్పిటల్ డాక్టర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షానవాస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. డయాబెటిస్, హృద్రోగ సమస్యలు ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







