మస్కట్:రికార్డు తిరగరాసిన మవసలాత్
- August 30, 2018
మస్కట్: ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, ఈద్ అల్ అధా రెండవ రోజున 28,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించడం ద్వారా సరికొత్త రికార్డ్ని సొంతం చేసుకుంది. ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా ఆగస్ట్ 17 నుంచి 25 వరకు మొత్తం 187,964 మంది ప్రయాణీకులు మవసలాత్ సేవల్ని వినియోగించుకున్నారు. ఈద్ అల్ అదా రెండవ రోజున 28 వేల మంది ప్రయాణించడం ఓ రికార్డ్. ప్రయాణీకుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్ల అవగాహన పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని మవసలాత్ ప్రతినిథులు పేర్కొన్నారు. ప్రయాణీకులకు ఈ సందర్భంగా మవసలాత్ కృతజ్ఞతలు తెలిపింది. భద్రత, మెరుగైన సౌకర్యాలు, సమయపాలన ఇవన్నీ మవసలాత్ ఈ స్థాయిలో ప్రయాణీకుల్ని ఆకట్టుకోవడానికి కారణమని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







