మస్కట్:రికార్డు తిరగరాసిన మవసలాత్
- August 30, 2018
మస్కట్: ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, ఈద్ అల్ అధా రెండవ రోజున 28,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించడం ద్వారా సరికొత్త రికార్డ్ని సొంతం చేసుకుంది. ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా ఆగస్ట్ 17 నుంచి 25 వరకు మొత్తం 187,964 మంది ప్రయాణీకులు మవసలాత్ సేవల్ని వినియోగించుకున్నారు. ఈద్ అల్ అదా రెండవ రోజున 28 వేల మంది ప్రయాణించడం ఓ రికార్డ్. ప్రయాణీకుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్ల అవగాహన పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని మవసలాత్ ప్రతినిథులు పేర్కొన్నారు. ప్రయాణీకులకు ఈ సందర్భంగా మవసలాత్ కృతజ్ఞతలు తెలిపింది. భద్రత, మెరుగైన సౌకర్యాలు, సమయపాలన ఇవన్నీ మవసలాత్ ఈ స్థాయిలో ప్రయాణీకుల్ని ఆకట్టుకోవడానికి కారణమని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







