రాజమండ్రిలో హీరో సూర్య ను అడ్డుకున్న అభిమానులు..
- August 31, 2018
తమిళ్ హీరో సూర్య..తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గజని , వీడోక్కడే, సింగం ఇలా ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల 24 తో ప్రశంసలు అందుకున్న ఈయన..ప్రస్తుతం ఎన్ జీకే అనే సినిమా చేస్తున్నాడు. 7/జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు వచ్చారు. తనకోసం వచ్చారని తెలుసుకున్న సూర్య కార్ వ్యాన్ దిగి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించి,అభిమానులతో సెల్ఫీలు దిగారు.
సూర్యకి రాజమండ్రిలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. సెక్యూరిటీ కూడా అభిమానులని అదుపు చేయలేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసినట్టు దర్శకుడు తన బ్లాగ్ ద్వారా తెలియజేశాడు. ఈ చిత్రంలో సూర్య కు జోడిగా రకుల్ ప్రీత్సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







