రష్యాలో కలిసి చిందులేసిన భారత్‌, పాక్ జవాన్లు

- August 31, 2018 , by Maagulf
రష్యాలో కలిసి చిందులేసిన భారత్‌, పాక్ జవాన్లు

భారత, పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ జవాన్లు బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. తమ డ్యాన్స్‌తో శాంతి సందేశాన్ని వినిపించారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు చేసిన నృత్యం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిబర్కుల్ పట్టణంలో జరిగిన డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఎస్‌సీవో సభ్యదేశాలు అయిన తర్వాత మొదటిసారి రెండు దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com