మరణించింది ఆమె కాదు.. నేను:బీఏ రాజు
- August 31, 2018
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు దర్శకురాలు జయ. ఆమె మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మెగా స్టార్ చిరంజీవి.
ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త బీఏ రాజుకి ఫోన్ చేసి పలకరించగా ‘ మరణించింది నా భార్య కాదండి.. నేను’.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా ఊహల్లో, నా ఆలోచనల్లో నా భార్య బ్రతికే ఉందంటూ ఆయన బాధపడిన తీరు తనను కలచివేసిందన్నారు.
అనంతరం.. చిరంజీవి జయతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నాకు మంచి మిత్రురాలు, సోదర సమానురాలు. ఆమె భర్త.. వెయ్యికి పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన రాజుతో మంచి అనుబంధం ఉంది. జయ దర్శకురాలిగానే కాకుండా రైటర్గా, సీనియర్ జర్నలిస్ట్గా పలు శాఖల్లో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జయ మరణం పరశ్రమకు తీరనిలోటు. జయ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి