మరణించింది ఆమె కాదు.. నేను:బీఏ రాజు
- August 31, 2018
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు దర్శకురాలు జయ. ఆమె మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మెగా స్టార్ చిరంజీవి.
ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త బీఏ రాజుకి ఫోన్ చేసి పలకరించగా ‘ మరణించింది నా భార్య కాదండి.. నేను’.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా ఊహల్లో, నా ఆలోచనల్లో నా భార్య బ్రతికే ఉందంటూ ఆయన బాధపడిన తీరు తనను కలచివేసిందన్నారు.
అనంతరం.. చిరంజీవి జయతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నాకు మంచి మిత్రురాలు, సోదర సమానురాలు. ఆమె భర్త.. వెయ్యికి పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన రాజుతో మంచి అనుబంధం ఉంది. జయ దర్శకురాలిగానే కాకుండా రైటర్గా, సీనియర్ జర్నలిస్ట్గా పలు శాఖల్లో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జయ మరణం పరశ్రమకు తీరనిలోటు. జయ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







