మరణించింది ఆమె కాదు.. నేను:బీఏ రాజు
- August 31, 2018
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు దర్శకురాలు జయ. ఆమె మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మెగా స్టార్ చిరంజీవి.
ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త బీఏ రాజుకి ఫోన్ చేసి పలకరించగా ‘ మరణించింది నా భార్య కాదండి.. నేను’.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా ఊహల్లో, నా ఆలోచనల్లో నా భార్య బ్రతికే ఉందంటూ ఆయన బాధపడిన తీరు తనను కలచివేసిందన్నారు.
అనంతరం.. చిరంజీవి జయతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నాకు మంచి మిత్రురాలు, సోదర సమానురాలు. ఆమె భర్త.. వెయ్యికి పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన రాజుతో మంచి అనుబంధం ఉంది. జయ దర్శకురాలిగానే కాకుండా రైటర్గా, సీనియర్ జర్నలిస్ట్గా పలు శాఖల్లో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జయ మరణం పరశ్రమకు తీరనిలోటు. జయ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







