షూటింగ్ మధ్యలో హీరోయిన్ జంప్..
- September 01, 2018
చుట్టూ కొండలు మధ్యలో మనుషులు. అక్కడ షూటింగ్. హీరో హీరోయిన్లతో పాట చిత్రీకరిస్తున్నారు యూనిట్ సభ్యులు. మధ్యలో చిన్న విరామం. ఇంతలో హీరోయిన్ కనిపించకుండా పోయింది. విషయం తెలిసి యూనిట్ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కేశవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అవళుక్కెన్న అళగియ ముగం’. కొడైకెనాల్లోని ఎత్తైన కొండల నడుమ పాటను చిత్రీకరిస్తున్నారు.
హీరోయిన్ అనుపమ ప్రకాష్ విరామం మధ్యలో తన రూముకు వెళ్లింది. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే సమయానికి కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ యూనిట్ సభ్యులు ఆరా తీయగా తన స్వస్థలం ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. నిర్మాత స్వయంగా వెళ్లి విషయం అడగ్గా ఎత్తైన కొండల నడుమ డాన్స్ చేయడంతో భయంగా అనిపించిందని అందుకే వచ్చేసానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాటను కంప్లీట్ చేసే నిమిత్తంగా మళ్లీ ఆమెను తీసుకువచ్చి మిగిలిన భాగాన్ని చిత్రీకరించారు చిత్ర యూనిట్.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







