ఏటీఎం బూత్లోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరికి గాయాలు
- September 01, 2018
మోటరిస్ట్ ఒకరు తాను నడుపుతున్న వాహనంపై అదుపు కోల్పోవడంతో ఆ వాహనం దుబాయ్లోని ఓ మాల్ వద్దనున్న ఏటీఎం బూత్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుర్జుమాన్ షాపింగ్ సెంటర్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏటీఎం బూత్లో ఐదుగురు వున్నట్లు తెలుస్తోంది. ఫోర్ వీల్ డ్రైవ్ కారు ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందగానే, అక్కడికి పోలీసులు చేరుకున్నారు. 40 ఏళ్ళ వయసున్న ఆసియాకి చెందిన డ్రైవర్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. మరో కారు అడ్డంగా రావడంతో తాను బ్రేక్ వేసే క్రమంలో, పొరపాటున యాక్సిలరేటర్పై కాలు మోపడంతో ప్రమాదం జరిగిందని ఆ కారుని నడుపుతున్న వ్యక్తి పోలీసులకు తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు, వాహనాన్ని నడిపిన వ్యక్తి ఆల్కహాల్గానీ డ్రగ్స్గానీ తీసుకోలేదనీ, మొబైల్ ఫోన్ని సైతం ఆ సమయంలో వినియోగించలేదని తెలిపారు. నిర్లక్ష్యం, వాహనం నడుపుతున్న సమయంలో సరిగ్గా దృష్టిపెట్టకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని లెఫ్టినెంట్ కల్నల్ అల్ కాసిమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







