విమానం నుండి దించేసినందుకు రూ.35 లక్షల జరిమానా

- September 01, 2018 , by Maagulf
విమానం నుండి దించేసినందుకు రూ.35 లక్షల జరిమానా

జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ కెనడా సంస్లు ఒక మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్‌ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్‌ అనే మహిళ తన 11 ఏళ్ళ కూతురు, మూడేళ్ళ కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. ఢిల్లీ వరకూ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానమెక్కి ఢిల్లీలో ఎయిర్‌ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని విమానం నుంచి బలవంతంగా దింపేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com