'దుబాయ్ పవనిజం'ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

- September 01, 2018 , by Maagulf

దుబాయ్:గత రాత్రి దుబాయ్ లోని అల్ ఖైల్ మాల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 47వ పుట్టిన రోజు వేడుకలను అభిమాన సంఘం 'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.మధ్యాహ్నం అభిమానులు 100 మంది పైగా రక్త దానం చేసారు.రక్త దానం చేసిన పలువురి అభిమానులను సన్మానించారు.సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.కాని పవన్ అభిమానులు గల్ఫ్ లో శుక్రవారం సెలవు కనుక పుట్టిన రోజు వేడుకలు ముందుగానే జరుపుకున్నారు.

సాయంత్రం మహిళా అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.తదనంతరం అభిమానులకు కార్యక్రమ నిర్వాహకులు విందు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ అభిమానులు,జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com