తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు
- September 02, 2018
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ దుర్గగుడిలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారుర. మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో రాజగోపురం ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఉట్టికొట్టే పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వేడుకల్లో చిన్నారులు చిన్ని కృష్ణులుగా అలరించారు. కృష్ణుడి వేషంలో ఉట్టికొట్టేందుకు పోటీపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సాగాయి. పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు కృష్ణుడి వేషధారణలో అలరిస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.
ఆదిలాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. స్థానిక మురళీకృష్ణ ఆలయం నుంచి భక్తులు భజనలు చేస్తూ ముందుకు సాగారు. శ్రీకృష్ణుడి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో సందడి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







