యూఏఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- September 03, 2018
రస్ అల్ ఖైమా:20 ఏళ్ళ వ్యక్తి ఒకరు, రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనం ఆ వ్యక్తిని బలంగా ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాపిక్ అండ్ పెట్రోల్స్ సెక్షన్ హెడ్ మేజర్ సలీమ్ మొహమ్మద్ బుర్కిబా మాట్లాడుతూ, ప్రమాదం గురించిన సమాచారం అందగానే పెట్రోల్స్, నేషనల్ అంబులెన్స్ మరియు పారామెడిక్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారాయన. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఆ వాహనాన్ని సరిగ్గానే నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదాన్ని నివారించేందుకు వాహనదారుడు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మృతదేహాన్ని హాస్పిటల్ మాగ్యూకి తరలించారు. వాహనదారులు, రోడ్లపై నడిచేవారు అప్రమత్తంగా వుంటే ఇలాంటి ప్రమాదాల్ని నివారించగలమని పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







