యూఏఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- September 03, 2018
రస్ అల్ ఖైమా:20 ఏళ్ళ వ్యక్తి ఒకరు, రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనం ఆ వ్యక్తిని బలంగా ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాపిక్ అండ్ పెట్రోల్స్ సెక్షన్ హెడ్ మేజర్ సలీమ్ మొహమ్మద్ బుర్కిబా మాట్లాడుతూ, ప్రమాదం గురించిన సమాచారం అందగానే పెట్రోల్స్, నేషనల్ అంబులెన్స్ మరియు పారామెడిక్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారాయన. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఆ వాహనాన్ని సరిగ్గానే నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదాన్ని నివారించేందుకు వాహనదారుడు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మృతదేహాన్ని హాస్పిటల్ మాగ్యూకి తరలించారు. వాహనదారులు, రోడ్లపై నడిచేవారు అప్రమత్తంగా వుంటే ఇలాంటి ప్రమాదాల్ని నివారించగలమని పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి