యూఏఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- September 03, 2018
రస్ అల్ ఖైమా:20 ఏళ్ళ వ్యక్తి ఒకరు, రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనం ఆ వ్యక్తిని బలంగా ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాపిక్ అండ్ పెట్రోల్స్ సెక్షన్ హెడ్ మేజర్ సలీమ్ మొహమ్మద్ బుర్కిబా మాట్లాడుతూ, ప్రమాదం గురించిన సమాచారం అందగానే పెట్రోల్స్, నేషనల్ అంబులెన్స్ మరియు పారామెడిక్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారాయన. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఆ వాహనాన్ని సరిగ్గానే నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదాన్ని నివారించేందుకు వాహనదారుడు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మృతదేహాన్ని హాస్పిటల్ మాగ్యూకి తరలించారు. వాహనదారులు, రోడ్లపై నడిచేవారు అప్రమత్తంగా వుంటే ఇలాంటి ప్రమాదాల్ని నివారించగలమని పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







