న్యూ రాడార్ టెక్నాలజీపై పోలీసుల వివరణ
- September 04, 2018
అబు ధాబి: రోడ్డుపై వాహనాలు వెళుతున్న సమయంలో రాడార్ ఫ్లాష్ లైట్ వెలుగుతుండడం పట్ల వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, వాహనదారులను ఉద్దేశించి ఓ వివరణను ఇచ్చారు. ఆ వివరణలో, కొత్త టెక్నాలజీ ద్వారా వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించడం జరుగుతోందనీ, తద్వారా ట్రాఫిక్ ఫ్లో మరియు వాహనాల సంఖ్యను మానిటరింగ్ చేయడమే ఈ రాడార్ కెమెరాల ఉద్దేశ్యమని పేర్కొన్నారు పోలీసులు. ఈ ఫ్లాష్ లైట్ ద్వారా వాహనాల్ని క్యాచ్ చేసి, జరీమానాలు విధించే అవకాశం లేదని పోలీసులు స్పస్టం చేశారు. ఇదిలా వుంటే ఎడిపి వెబ్సైట్ని దర్శించి వాహనదారులు స్పీడ్ లిమిట్స్ గురించి తెలుసుకోవాలనీ, స్పీడ్ లిమిట్స్కి అనుగుణంగా వాహనాలు నడపడం మంచిదని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







