జపాన్ ను కుదిపేసిన తుఫాన్
- September 04, 2018జపాన్ లో భారీ తుఫాన్ సంభవించింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ అతలాకుతలం చేసింది. జెబీ దాటికి తీవ్ర నష్టం జరిగింది. ఈ తుఫాను దాటికి ఆరుగురు మృతి చందాగా, వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి.
క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. మిలియన్ కు పైగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. జపాన్ లో ఇళ్లు ఎక్కువ భాగం కలపతో నిర్మించుకుంటారు. దీంతో ప్రచంచగాలులకు ఆ ఇళ్లు కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!