దుబాయ్:భవనంపైనుంచి పడి ఓ వ్యక్తి మృతి
- September 04, 2018
దుబాయ్:బుర్ దుబాయ్లోని ఓ భవనం రూఫ్ టాప్ నుంచి కింది పడి భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన షఫీర్గా మృతుడ్ని గుర్తించారు. దుబాయ్లోని ఓ ప్రముఖ జ్యుయెలరీ షాప్లో ఈ వ్యక్తి పనిచేస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. లంచ్ తర్వాత రూఫ్ టాప్ మీదకు వెళ్ళిన షఫీర్, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి కిందకి పడిపోయినట్లు అతని బంధువు చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







