దుబాయ్:భవనంపైనుంచి పడి ఓ వ్యక్తి మృతి
- September 04, 2018దుబాయ్:బుర్ దుబాయ్లోని ఓ భవనం రూఫ్ టాప్ నుంచి కింది పడి భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన షఫీర్గా మృతుడ్ని గుర్తించారు. దుబాయ్లోని ఓ ప్రముఖ జ్యుయెలరీ షాప్లో ఈ వ్యక్తి పనిచేస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. లంచ్ తర్వాత రూఫ్ టాప్ మీదకు వెళ్ళిన షఫీర్, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి కిందకి పడిపోయినట్లు అతని బంధువు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత