దుబాయ్‌:భవనంపైనుంచి పడి ఓ వ్యక్తి మృతి

- September 04, 2018 , by Maagulf
దుబాయ్‌:భవనంపైనుంచి పడి ఓ వ్యక్తి మృతి

దుబాయ్‌:బుర్‌ దుబాయ్‌లోని ఓ భవనం రూఫ్‌ టాప్‌ నుంచి కింది పడి భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన షఫీర్‌గా మృతుడ్ని గుర్తించారు. దుబాయ్‌లోని ఓ ప్రముఖ జ్యుయెలరీ షాప్‌లో ఈ వ్యక్తి పనిచేస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. లంచ్‌ తర్వాత రూఫ్‌ టాప్‌ మీదకు వెళ్ళిన షఫీర్‌, అన్‌కాన్షియస్‌ స్టేజ్‌లోకి వెళ్ళి కిందకి పడిపోయినట్లు అతని బంధువు చెప్పారు.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com