జేబీ బీభత్సం.. విమానాశ్రయం మూసివేత
- September 05, 2018
కన్సాయి: జపాన్లో టైఫూన్ జేబీ బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత బలంగా వీస్తున్న గాలులకు.. అన్నీ కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కన్సాయి ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఒసాకా, కోబ్, క్యోటో ప్రాంత వాసులకు ఇదే ప్రధాన విమానాశ్రయం. ఈ రాష్ర్టాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో కట్టిన కన్సాయి ఎయిర్పోర్ట్.. జేబీ టైఫూన్ ధాటికి దెబ్బతిన్నది. ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్పై ట్యాంక్ సుడులు తిరిగింది. దీంతో ఆ బ్రిడ్జ్ ధ్వంసమైంది. గత 25 ఏళ్లలో ఇంత శక్తివంతమైన టైఫూన్ రావడం ఇదే మొదటిసారి. ఈ టైఫూన్ వల్ల సుమారు 10 మంది మృతిచెందారు. భయానకమైన గాలులకు రూఫ్టాప్లు లేచిపోతున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా ఎగిరిపోతున్నాయి. అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కన్సాయి ఎయిర్పోర్ట్ను మానవ నిర్మిత దీవిపై నిర్మించారు. ఈ విమానాశ్రయంలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







