జేబీ బీభత్సం.. విమానాశ్రయం మూసివేత
- September 05, 2018
కన్సాయి: జపాన్లో టైఫూన్ జేబీ బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత బలంగా వీస్తున్న గాలులకు.. అన్నీ కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కన్సాయి ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఒసాకా, కోబ్, క్యోటో ప్రాంత వాసులకు ఇదే ప్రధాన విమానాశ్రయం. ఈ రాష్ర్టాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో కట్టిన కన్సాయి ఎయిర్పోర్ట్.. జేబీ టైఫూన్ ధాటికి దెబ్బతిన్నది. ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్పై ట్యాంక్ సుడులు తిరిగింది. దీంతో ఆ బ్రిడ్జ్ ధ్వంసమైంది. గత 25 ఏళ్లలో ఇంత శక్తివంతమైన టైఫూన్ రావడం ఇదే మొదటిసారి. ఈ టైఫూన్ వల్ల సుమారు 10 మంది మృతిచెందారు. భయానకమైన గాలులకు రూఫ్టాప్లు లేచిపోతున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా ఎగిరిపోతున్నాయి. అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కన్సాయి ఎయిర్పోర్ట్ను మానవ నిర్మిత దీవిపై నిర్మించారు. ఈ విమానాశ్రయంలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి