ఆరో తేదిన సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
- September 05, 2018
ముందస్తుకు ముహుర్తం ఫిక్స్ అయింది. వారం, తిథి, నక్షత్రం అన్ని కలిసొచ్చిన గురువారం రోజునే అసెంబ్లీ రద్దుకు రెడీ అయ్యారు కేసీఆర్. కేబినెట్ భేటీలో తీర్మానం చేసి..ఆ తీర్మానాన్ని తానే స్వయంగా గవర్నర్ కు అందించనున్నారు. మరోవైపు టిక్కెట్లు కన్ఫమ్ అయిన నేతలకు ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సూచిస్తున్నారు సీఎం.
ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ తొలి అసెంబ్లీ మరికొద్ది గంటల్లో రద్దు కాబోతోంది. ఎమ్మెల్యేలు అంతా మాజీలు కాబోతున్నారు. అదృష్ట సంఖ్యగా చెప్పుకునే ఆరో తేదిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. మధ్యాహ్నం సమావేశం కానున్న కేబినెట్..శాసనసభరద్దుపై ఏకవాక్య తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానం ప్రతిని సీఎం కేసీఆరే స్వయంగా గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గవర్నర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
మరికొద్ది గంటల్లో జరగబోయే కేబినెట్ సమావేశం కోసం ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ముందస్తుపై మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. పరిపాలనపరంగా బుధవారమే దాదాపుగా ఆఖరు రోజు కావటంతో ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతల అప్పగింతల అంశాలపై ఈ రాత్రికల్లా కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. గురువారం కేబినెట్ సమావేశం సమాయానల్లా నిర్ణయాలు వెలువడొచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







