పడవ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 26 మంది గల్లంతు..
- September 05, 2018
గువాహటిలో దారుణం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 26 మంది గల్లంతు అయినట్లు సమాచారం. తీరం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.పడవలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఓ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో పడవ రెండు ముక్కలైంది. కొందరు ప్రయాణికులు ఈదుతూ సురక్షితంగా బయటకు రాగలిగారు. గల్లంతు అయిన వారికోసం రాష్ట్ర విపత్తు స్పందన దళం సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







