'నవాబ్' ఆడియో విడుదల

- September 06, 2018 , by Maagulf
'నవాబ్' ఆడియో విడుదల

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన మణిరత్నం ..ఇటీవల కాలం లో వరుస ప్లాపులు చేసి ప్రేక్షకులను , అభిమానులను నిరాశలో పడేసాడు. అంతే కాదు మణిరత్నం సినిమాలంటే బోర్ అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్ ) పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్‌, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతుంది.

ఈ సందర్బంగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక బుధవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ .ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పొన్నియిన్‌ సెల్వం' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com