మెక్సికో:166 మందిని చంపి పాతిపెట్టిన కిరాతకులు
- September 07, 2018మెక్సికో:తమ అకృత్యాలకు, అక్రమ దందాకు అడ్డొచ్చిన ఎంతమందిని అయినా చంపి వేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగింది. తూర్పు మెక్సికోలోని వెరక్రూజ్ ప్రాంతంలో 166 మంది పౌరుల మృతదేహాలను పోలీసులు గుర్తించడం దేశంలో సంచలనం సృష్టించింది.
వీరంతా ఎవరు..? ఇంతమందిని ఎవరు చంపి ఉంటారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలలో విచ్చలవిడిగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మాఫియాతో ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ఆ ముఠాతో జరిగిన ఘర్షణల్లో 166 మందిని చంపి, పాతిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఆగస్టు 8న తవ్వకాలు ప్రారంభించిన పోలీసులకు 166 పుర్రెలు, 200 దుస్తులు, 144 ఐడీ కార్డులు లభించాయి. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం వారిని చంపి ఉంటారని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతం ఎక్కడుందో మెక్సికో ప్రభుత్వం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి